• About
  • Advertise
  • Careers
  • Contact
Tuesday, March 28, 2023
31 °c
Rajamahendravaram
30 ° Wed
29 ° Thu
30 ° Fri
30 ° Sat
  • Login
లీడర్ | LEADER
  • హోమ్
  • పాలిటిక్స్
  • జనరల్
  • క్రైమ్
  • స్పెషల్ స్టోరీ
  • మూవీస్
  • స్పోర్ట్స్
  • ఉత్తరాంధ్ర
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • మన్యం
  • మరిన్ని
    • ఇంటర్నేషనల్
    • బిజినెస్
    • ఎంటర్టైన్మెంట్
    • సైన్స్ & ఎడ్యుకేషన్
    • లిటరేచర్
    • యాడ్స్
No Result
View All Result
లీడర్ | LEADER
  • హోమ్
  • పాలిటిక్స్
  • జనరల్
  • క్రైమ్
  • స్పెషల్ స్టోరీ
  • మూవీస్
  • స్పోర్ట్స్
  • ఉత్తరాంధ్ర
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • మన్యం
  • మరిన్ని
    • ఇంటర్నేషనల్
    • బిజినెస్
    • ఎంటర్టైన్మెంట్
    • సైన్స్ & ఎడ్యుకేషన్
    • లిటరేచర్
    • యాడ్స్
No Result
View All Result
లీడర్ | LEADER
No Result
View All Result
Home పాలిటిక్స్ టి ఎస్ పాలిటిక్స్

కోర్టుకు వెళ్లి కేసీఆర్‌ సాధించిందేమిటి?

January 30, 2023
in జనరల్, టి ఎస్ పాలిటిక్స్
Reading Time: 1 min read
0
A A
కోర్టుకు వెళ్లి కేసీఆర్‌ సాధించిందేమిటి?

– గవర్నర్‌- గవర్నమెంట్‌ పోరులో గెలిచిందెవరు? ఓడిందెవరు?
– కోర్టులో చెప్పిన మాట ముందే ఎందుకు ప్రకటించలేదు?
– సుప్రీంకోర్టు లాయరు వచ్చినా ఏం ప్రయోజనం?
– సర్దుబాటుతో ప్రజాధనం వృధాయేనా?
– గవర్నర్‌పై ప్రభుత్వ వ్యాఖ్యలు విచారకమన్న దవే
– గవర్నర్‌పై విమర్శలు తప్పేనని కేసీఆర్‌ సర్కారు ఒప్పుకోలు
– బయట విమర్శలు, లోపల విచారమేల?
– కేసీఆర్‌కు కోర్టుకు వెళ్లమని సలహా ఇచ్చిందెవరు?
– కేసీఆర్‌ను తప్పుదోవపట్టిస్తున్నారా?
– జాతీయ స్థాయిలో పేరు వచ్చే అవకాశాన్ని కేసీఆర్‌ వదులుకున్నారా?
– బీఆర్‌ఎస్‌లో చర్చ

కొన్ని వేల పుస్తకాలు చదివిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ను.. కీలకమైన న్యాయపరమైన అంశాలకు సంబంధించి ఎవరైనా తప్పుదోవపట్టిస్తున్నారా? గవర్నర్‌ వ ర్సెస్‌ గవర్నమెంట్‌ అంశంలో కోర్టుకు వెళ్లి, భంగపడిన వైనంపై బీఆర్‌ఎస్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
బడ్జెట్‌ను ఆమోదించాలంటూ తెలంగాణ సర్కారు పంపిన లేఖపై.. గవర్నర్‌ తమిళసై ఎంతకూ స్పందించకపోవడాన్ని, కేసీఆర్‌ సర్కారు ప్రతిష్ఠగా తీసుకుంది. రాజ్‌భవన్‌ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడాన్ని అవమానంగా భావించింది. బడ్జెట్‌ ఆమోదించకపోతే రాగల సమస్యలను దృష్టి ఉంచుకుని, గవర్నర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లడం సంచలనం సృష్టించింది. లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేసిన కేసీఆర్‌.. తీరా గవర్నర్‌ వైఖరిపై చివరి వరకూ పోరాడకుండా, మధ్యలోనే అస్త్ర సన్యాసం చేయడం బీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది గవర్నర్‌, ఆమెకు మద్దతునిస్తున్న బీజేపీకి దక్కిన మైలేజీగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
నిజానికి ఈ అంశంపై మీడియాలో విపరీత ప్రచారం జరగడంతో, సహజంగానే ఇంటా-బయటా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏకంగా గవర్నర్‌పైనే కేసు వేయడమే దానికి కారణం. కానీ చివరాఖరకు.. గవర్నర్‌పై తాము వేసిన పిటిషన్‌ వెనక్కి తీసుకుంటున్నట్లు ఢిల్లీ నుంచి కేసు వాదించేందుకు వచ్చిన, సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే హైకోర్టుకు వెల్లడించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభుత్వంలో ఉన్న వారు గవర్నర్‌ను విమర్శిస్తున్నారంటూ, గవర్నర్‌ న్యాయవాది చెప్పడంతో.. ఇకపై గవర్నర్‌ను విమర్శించవద్దని ప్రభుత్వానికి చెబుతానంటూ దవే సమాధానం ఇవ్వడం మరో ఆశ్చర్యం.
‘గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలను నేను కూడా ఖండిస్తా. అలాంటి మాటలు సరికాదు. ఆమె ఒక మహిళ అని ఆమెను విమర్శించేవారు గుర్తించాలి. మహిళను గౌరవించాలి. నేను ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతా’నని.. దవే వినయపూర్వకంగా హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లడం ఆశ్చర్యపరిచింది. తర్వాత పరిణామాల అనంతరం.. బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు చెప్పగా, గవర్నర్‌ తన రాజ్యాంగపరమైన విధులు నిర్వహిస్తారని గవర్నర్‌ న్యాయవాది తెలిపారు.
నిజానికి ఈ ఎపిసోడ్‌పై ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఢిల్లీ నుంచి బోలెడు ఫీజులు ఇచ్చి తెచ్చుకున్న న్యాయవాది దవే, గవర్నర్‌కు వ్యతిరేకంగా ఏం వాదిస్తారోనన్న ఉత్కంఠ.. అటు న్యాయవాద వర్గాల్లోనూ కనిపించింది. అసలు పిటిషన్‌ను హైకోర్టు తీసుకుంటుందా? లేక దానికి విచారణ అర్హత లేదని తిరస్కరిస్తుందా? గవర్నర్‌ను ఆదేశించే అధికారం హైకోర్టుకు ఉందా? లేదా? అన్న అంశంపై న్యాయవాదవర్గాల్లో చర్చోపచర్చలు జరిగాయి. చివరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకు.. ప్రభుత్వం-రాజ్‌భవన్‌ లాయర్ల మధ్య చర్చలు జరిగాయి. అందులో ఇద్దరూ ఏకాభిప్రాయానికి రావడంతో కథకు తెరపడింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చొరవతో, గవర్నర్‌-గవర్నమెంట్‌ పోరు కథ తాత్కాలికంగా కంచికి చేరింది. అయితే ఇందులో చాలా సందేహాలు మిగిలిపోవడంపైనే, ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ..అంతకుముందు గవర్నర్‌పై ప్రభుత్వ ప్రముఖులు చేసిన విమర్శలను, ప్రభుత్వం తరఫున వాదించిన దవే ఖండించారు. అంటే ప్రభుత్వ ప్రముఖులు చేసిన విమర్శలు తప్పు అని, కోర్టు సాక్షిగా అంగీకరించినట్లేనని బీఆర్‌ఎస్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కోర్టులో ప్రభుత్వ న్యాయవాది వ్యాఖ్యలన్నీ, ప్రభుత్వ వ్యాఖ్యలుగానే పరిగణించాల్సి ఉంటుందని బీఆర్‌ఎస్‌ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
మరి అంతోటి దానికి ఢిల్లీ నుంచి ప్రత్యేక న్యాయవాది దవేని, లక్షలు పోసి హైదరాబాద్‌ తీసుకురావలసిన అవసరం ఏముంది? అదేదో అడ్వకేట్‌ జనరలే స్పందించి, గవర్నర్‌పై వ్యాఖ్యలు తప్పేనని చెప్పి ఉంటే బోలెడంత ప్రజాధనం మిగిలేది కదా? ఇప్పుడు గవర్నర్‌కు దాదాపు క్షమాపణ చెప్పినంత పనిచేయడం వల్ల, ఇంతకాలం గవర్నర్‌ తీరుపై పార్టీ చేసిన పోరాటం, సాధించిన మైలేజీ ఏమైనట్లు? దీనివల్ల ప్రభుత్వమే గవర్నర్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించింది. ఒక మహిళ ను అవమానించి, వేధిస్తున్నారంటూ బీజేపీ చే సిన విమర్శలను అంగీకరించడమే కదా? అన్న కొత్త చర్చకు బీఆర్‌ఎస్‌లో తెరలేచింది.
అసలు దీనికంటే ముందే.. మంత్రుల ప్రతినిధి బృందాన్ని గవర్నర్‌ వద్దకు పంపి.. బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం ఉంటుందని ఆమెకు నచ్చచెప్పి ఉంటే, వ్యవహారం ఇక్కడి దాకా వచ్చేది కాదని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు వ్యాఖ్యానించారు.
ఇంత కీలకమైన అంశంపై.. సీఎం కేసీఆర్‌ను పక్కదారి పట్టించారన్న వ్యాఖ్యలు కూడా, పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. గవర్నర్‌పై కేసు వేసిన సందర్భంలో అది విచారణ అర్హత సాధిస్తుందా? అసలు హైకోర్టుకు, గవర్నర్‌ను బడ్జెట్‌ ఆమోదించమని ఆదేశించే రాజ్యాంగపరమైన అర్హత ఉందా? వంటి కీలక అంశాలపై అధ్యయం చేయకపోవడంపై, పార్టీ సీనియర్లు ఆశ్చర్యం వ్యక్తం చే స్తున్నారు.
ఈ అంశంలో ఎలాంటి న్యాయపరమైన అధ్యయనం-వాటి సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా, గవర్నర్‌కు వ్యతిరేకంగా కేసు వేసి, చివరకు పరువు పోగొట్టుకున్నట్లయిందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఈ అంశాలన్నీ కేసీఆర్‌కు ముందస్తుగా వివరించకుండా, అనవసర ప్రతిష్ఠకు వెళ్లి ఆయనను తప్పుదోవపట్టించారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం.. గవర్నర్‌ తమిళసై పైచేయి సాధించడంతోపాటు.. ఆమెపై కేసీఆర్‌ నుంచి మంత్రుల వరకూ చేసిన విమర్శలు తప్పన్న సంకేతాలు మిగిల్చాయంటున్నారు.
అయితే గవర్నర్‌పై వేసిన పిటిషన్‌ ఉపసంహరించుకోకుండా.. న్యాయ పోరాటం కొనసాగించి ఉంటే, కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో పేరు వచ్చేదని బీఆర్‌ఎస్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే జాతీయ స్థాయిలో బీజేపీపై పోరాడుతున్న నేతగా, కేసీఆర్‌ను దేశప్రజలు గుర్తిస్తున్నారు. పైగా గవర్నర్‌ చర్యలపై బీఆర్‌ఎస్‌ పోరాటాన్ని, దేశంలోని విపక్షాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్‌పై న్యాయపోరాటాన్ని కొనసాగించి ఉంటే, బీఆర్‌ఎస్‌కు జాతీయ స్థాయిలో రాజకీయంగా కీర్తి ప్రతిష్ఠలు దక్కేవని చెబుతున్నారు. పిటిషన్‌ ఉపసంహరణతో, కేసీఆర్‌ అలాంటి అవకాశం వదులుకున్నారని బీఆర్‌ఎస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇవన్నీ తమ పోరాటాలేవీ, చివరి మజిలీ చేరవన్నg సంకేతాలు వెళ్లేందుకు కారణమవుతాయని సీనియర్లు విశ్లేషిస్తున్నారు

ShareTweetSendShareShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Related Posts

ఈపీఎఫ్‌ వడ్డీ రేటు 8.15శాతం

ఈపీఎఫ్‌ వడ్డీ రేటు 8.15శాతం

ఆసుపత్రి ముందు పానిపూరి అమ్ముతున్న లేడీ డాక్టర్.. ప్రభుత్వంపై నిరసన

ఆసుపత్రి ముందు పానిపూరి అమ్ముతున్న లేడీ డాక్టర్.. ప్రభుత్వంపై నిరసన

పేలిన మూడు క్షిపణులు

పేలిన మూడు క్షిపణులు

ఉద్యోగుల హెల్తు స్కీం, పీఆర్సీ అంశాలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సిఎస్ అధ్యక్షతన సమావేశం.

ఉద్యోగుల హెల్తు స్కీం, పీఆర్సీ అంశాలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సిఎస్ అధ్యక్షతన సమావేశం.

Load More
Next Post
విశాఖ ఉక్కు తెలుగు ప్రజల గుండె చప్పుడు

విశాఖ ఉక్కు తెలుగు ప్రజల గుండె చప్పుడు

Latest News

సుప్రీంలో జగన్ కు చుక్కెదురు

సుప్రీంలో జగన్ కు చుక్కెదురు

ఢిల్లీ, న్యూస్ లీడర్ సుప్రీంలో జగన్ కు చుక్కెదురైంది. అమరావతిపై హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. అంతకు ముందు సాధ్యం కాదన్న ధర్మాసనం.. కేసు...

ఏఈ ప్రశ్నపత్రం ఎంతమందికి విక్రయించారు?

ఏఈ ప్రశ్నపత్రం ఎంతమందికి విక్రయించారు?

హైదరాబాద్‌, న్యూస్‌లీడర్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం మూడో రోజు విచారణ కొనసాగుతోంది. కస్టడీలో ఉన్న నలుగురు నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌, డాక్యానాయక్‌,...

నోటీసుపై హుందాగా స్పందించిన రాహుల్

నోటీసుపై హుందాగా స్పందించిన రాహుల్

బంగ్లా ఖాళీ చేయాలన్న లోక్‌సభ ప్యానెల్ నోటీసులకు రాహుల్ గాంధీ హుందాగా స్పందించారు. లోక్‌సభ సెక్రటేరియట్‌కు లేఖ రాశారు. బంగ్లా ఖాళీ చేయాలనే నోటీసులకు కట్టుబడి ఉంటామని...

ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ

ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ

హైదరాబాద్‌, న్యూస్‌లీడర్‌: తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో మంగళవారం ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశాలకు తెలంగాణ, ఏపీ...

పక్కా ప్లాన్‌తో వచ్చి..  అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

పక్కా ప్లాన్‌తో వచ్చి.. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

నాష్‌విల్‌ (అమెరికా), న్యూస్‌లీడర్‌: నాష్‌విల్‌ (అమెరికా) అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెన్నిస్సే రాష్ట్రంలోని నాష్‌విల్‌లోని ఓ మిషినరీ పాఠశాల లో సోమవారం జరిగిన...

హజ్‌ యాత్రకు వెళ్తూ..  బస్సు బోల్తా పడి 20 మంది దుర్మరణం

హజ్‌ యాత్రకు వెళ్తూ.. బస్సు బోల్తా పడి 20 మంది దుర్మరణం

అభా, న్యూస్‌లీడర్‌: సౌదీ అరేబియాలోని యాసిర్‌ ప్రావిన్స్‌, అభా నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉమ్రా కోసం మక్కాకు వెళ్తున్న భక్తుల బస్సు బ్రేకులు విఫలం...

Load More
  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2022 Friends Media Network Pvt Ltd

No Result
View All Result
  • పాలిటిక్స్
  • ఇంటర్నేషనల్
  • బిజినెస్
  • సైన్స్ & ఎడ్యుకేషన్
  • నేషనల్ పాలిటిక్స్
  • ఎంటర్టైన్మెంట్
  • లిటరేచర్
  • మూవీస్
  • డ్రామా
  • స్పోర్ట్స్
  • ఫాషన్
  • లైఫ్ స్టైల్
  • హెల్త్

© 2022 Friends Media Network Pvt Ltd

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
We use cookies to ensure that we give you the best experience on our website. If you continue to use this site we will assume that you are happy with it.AcceptPrivacy Policy