న్యూఢిల్లీ, న్యూస్లీడర్, జూలై 27: ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పార్టీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి సోము వీర్రాజును తొలగించింది. పార్టీ అధ్యక్షుడిగా తొలగిస్తున్నట్లు వీర్రాజుకు జేపీ నడ్డా ఫోన్ చేసి చెప్పారు. అధ్యక్షుడిగా మీ టర్మ్ పూర్తి అయిందని, పదవికి రాజీనామా చేయాలని వీర్రాజుకు నడ్డా సూచించారు. వీర్రాజుకు ఇతర బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఏపీకి కొత్త అధ్యక్షుడిగా దగ్గుబాటి పురంధేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా జి.కిషన్రెడ్డిని నియమించారు. సోము వీర్రాజు 2020 జూలై 27 నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బీజేపీలో భారీ మార్పుల వెనక పెద్ద వ్యూహం కనిపిస్తోంది. తెలంగాణలో ముఖ్యంగా బండి సంజయ్ పట్ల కొత్త నేతల్లో కొంత వ్యతిరేకత ఉంది. ఫిర్యాదులు కూడా చేశారు. దీనిపై విస్త్రృతంగా చర్చించిన తర్వాత అందరికీ అమోదయోగ్యంగా ఉండే కిషన్రెడ్డి వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్న కిషన్రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారు. దీంతో ఆయనకు పగ్గాలు అప్పగించి ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడాలని పార్టీ భావిస్తోంది. ఎన్నికలకు కూడా కేడర్ను సిద్దం చేసే బాధ్యతను కిషన్ రెడ్డికి అప్పగిస్తున్నారు. అటు ఏపీలో కూడా బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. సోము వీర్రాజును మార్చాలని చాలాకాలంగా ఫిర్యాదులున్నాయి. గతంలో కన్నా లక్ష్మీనారాయణను మార్చి సోమును అధ్యక్షుడిగా నియమించారు. అయితే సోము వైసీపీకి దగ్గరగా ఉంటూ ప్రభుత్వ వ్యతిరేకతను బలంగా జనాల్లోకి తీసుకెళ్లడం లేదన్న భావన కేడర్లో ఉంది. అదే సమయంలో కన్నా వంటి సీనియర్లు పార్టీ వీడటానికి కారణం కూడా సోము తీరే అంటూ విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిని మార్చాలని పార్టీ హైకమాండ్ భావించి పురంధేశ్వరిని అధ్యక్షురాలిగా ప్రకటించింది. పురంధేశ్వరి మిగతా 2వ పేజీలో