దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే జల దిగ్బందంలో ఉన్నాయి.. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.. తెలంగాణాలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని అధికారులు వెల్లడించారు.
ఏపీలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. దాంతో.. నంద్యాల జిల్లాతోపాటు పలు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. మరో రెండు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ఊపందుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడంతో వారం రోజులుగా మంచి వర్షాలు లేకుండా పోయాయి.. ఇప్పుడు బంగాళఖాతంలో ఆవర్తనం ఏర్పడింది.. దీంతో మరో మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.
తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.