ఇస్లామాబాద్, న్యూస్లీడర్, జూలై 7 : భారత్లో అక్టోబరు 5 నుంచి ప్రపంచ క్రికెట్ పోటీలు ఆరంభం కానున్నాయి. అదే నెల 15న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులు భారత్`పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. 2012 నుంచి ఇటు ఇండియాలో కానీ, అటు పాకిస్థాన్లో కానీ ఈ రెండు జట్లు తలపడలేదు. తటస్థ వేదికలపైనే ఆడాయి.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ స్పందిస్తూ… ఇండియాలో జరగనున్న వరల్డ్కప్కు వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతిని కోరినట్టు చెప్పాడు. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నాడు. తాము ప్రపంచ కప్ ఆడేందుకు ఇండియాకు వెళ్తున్నామని… భారత్పై ఆడేందుకు మాత్రమే వెళ్లడం లేదని స్పష్టం చేశాడు. ఒక జట్టుపై మాత్రమే తాము ఫోకస్ చేయడం లేదని, అక్కడ మరో తొమ్మిది జట్లు ఉంటాయన్నాడు. ప్రత్యర్థి జట్లు అన్నింటినీ ఓడిరచినప్పుడే తాము ఫైనల్స్కు చేరుతామనే స్పృహ తమకు ఉందన్నాడు. ప్రొఫెషనల్ ఆటగాళ్లుగా అన్ని సవాళ్లకు తాము సిద్ధంగా ఉండాలన్నాడు. ప్రపంచంలో క్రికెట్ మ్యాచ్లు ఎక్కడ జరిగినా వెళ్లి ఆడేందుకు తాము సిద్ధమన్నాడు. ఇండియాలో ఎక్కడైనా, ఎవరితోనైనా ఆడేందుకు రెడీగా ఉన్నామని చెప్పుకొచ్చాడు.