హర్యానా న్యూస్లీడర్, జూలై 8 : హర్యానాలోని సోనిపట్ వద్ద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పొలాల్లో పని చేస్తున్న రైతులు, రైతు కూలీలను చూసి మాటామంతీ కలిపారు. అనంతరం ఆయన వారితో కలిసి వరినాట్లు వేశారు. సామాన్యుల కష్టాలను తెలుసుకునే క్రమంలో ఆయన ఈసారి రైతులతో మాట్లాడారు. శనివారం ఉదయం హిమాచల్ ప్రదేశ్కు బయలుదేరిన రాహుల్ గాంధీ.. హర్యానాలోని సోనిపట్లోని ఓ పొలం వద్ద ఆగారు. అక్కడి వారిని చూసిన ఆయన కారు ఆపి పొలంలో నాట్లు వేస్తున్న రైతులను పలకరించారు. ఆపై వారితో కలిసి కాసేపు నాట్లు వేశారు. అనంతరం ట్రాక్టర్ ఎక్కి కాసేపు పొలం దున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు కూడగట్టేందుకు రాహుల్ ఇలా వివిధ వర్గాల ప్రజలను నేరుగా కలుస్తున్నారు.
తాజాగా శనివారం హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లాలో ఉంటున్న సోదరి ప్రియాంక గాంధీ వాద్రాను కలుసుకోవడానికి వెళుతూ మధ్యలో ఇలా రైతులను కలుసుకున్నారు. రాహుల్ గాంధీ గతంలో ఢల్లీి నుంచి షిమ్లా వరకు రాత్రంతా ట్రక్కులో ప్రయాణించారు.
ఇటీవల రాహుల్ గాంధీ బైక్ మెకానిక్గా కరోల్ బాగ్ ఏరియాలోని ఓ మెకానిక్ షాపులో స్క్రూడైవర్, పానా చేత బట్టారు. అంతకుముందు లారీ డ్రైవర్లతో కలిసి రాత్రంతా ప్రయాణం చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు.