బెంగళూరు, న్యూస్లీడర్, జూలై 12 : సాంకేతిక కారణాల వల్ల వెనక్కు మళ్లిన ఓ విమానం ఎమర్జెన్సీ ల్యాండిరగ్ సమయంలో రన్వేపై అదుపు తప్పింది. అయితే ఎట్టకేలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ప్రమాదం తప్పింది. బెంగళూరు ఎయిర్పోర్టులో ఈ సంఘటన జరిగింది.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎయిర్పోర్టు నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి బయల్దేరిన ప్రీమియర్ 1ఏ విమానం వీటీ-కేబీఎన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విమానం టేకాఫ్ అయిన తర్వాత ముందు వైపునున్న నోస్ ల్యాండిరగ్ గేర్ రీట్రాక్ట్ కాలేదు. దీంతో విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు.
కాగా, ఎమర్జెన్సీ ల్యాండిరగ్ సమయంలో రన్వేపై నీరు నిలిచి ఉండగా, ఆ నీటిలోనే విమానం ముందుకెళ్లింది. అప్పటికే నోస్ ల్యాండిరగ్ గేర్ సరిగా లేకపోవడంతో ఒక్కసారిగా ముందుకు దొర్లింది. దీంతో విమానం ముందు భాగం రన్వేను తాకి కొంతదూరం అలాగే ముందుకెళ్లింది. ఎట్టకేలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు డీజీసీఏ వెల్లడిరచింది. ఘటన సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు మాత్రమే ఉన్నారు. అయితే ప్రయాణికులెవరూ లేరని డీజీసీఏ తెలిపింది. హాల్ ఎయిర్పోర్టులో విమానం దిగుతున్న తీరు, రన్వే పై ఉన్న నీటిలో వెళుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి.