ఆస్ట్రేలియా, న్యూస్ లీడర్, జూలై 18 ఆస్ట్రేలియా సముద్ర తీరంలో ఓ అంతుచిక్కని వస్తువు కనిపించడం కలకలానికి దారితీసింది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని గ్రీన్ హెడ్ పట్టణ తీరంలో ఇది కనిపించింది. రాగితో చేసిన డ్రమ్ము ఆకారంలో ఉన్న ఆ వస్తువు ఏమిటో అర్థంకాక స్థానికులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇటీవల చంద్రయాన్-3 ఆస్ట్రేలియా గగనతలంలో ప్రయాణించిన నేపథ్యంలో ఆ రాకెట్ నుంచి విడివడి కింద పడ్డ శకలం అయి ఉంటుందన్న చర్చ నెట్టింట నడుస్తోంది. ఈ వస్తువుకు దూరంగా ఉండాలంటూ స్థానికులను అక్కడి అధికారులు హెచ్చరించారు. అయితే ఈ వస్తువు ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది? అన్న విషయాలు తేల్చేందుకు ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ కూడా రంగంలోకి దిగింది. విదేశీ అంతరిక్ష ప్రయోగానికి సంబంధించినది అయి ఉండొచ్చని అంచనా వేస్తోంది. అంతేకాకుండా, పలు దేశాలతో ఈ విషయమై సంప్రదింపులు జరుపుతున్నట్టు సోషల్ మీడియాలో వెల్లడిరచింది. కాగా, ఈ వస్తువు భారత్కు చెందిన పీఎస్ఎల్వీ రాకెట్కు సంబంధించినది అని తాను అనుకుంటుంన్నట్టు అంతరిక్ష నిపుణురాలు డా. ఏలిన్ గార్మన్ తెలిపారు.