ఢిల్లీ, న్యూస్లీడర్, జూలై 18 : రాజధాని ఢిల్లీని వర్షాలు వదలడం లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలం అయిపోయింది. యమునా నది నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీ జనజీవనం మెల్లగా తిరిగి పట్టాలపైకి వస్తోంది. అయితే గత 24 గంటల్లో మరోసారి వరద ఢిల్లీ వాసుల ఆందోళనను మరింత పెంచింది. దీంతోపాటు మంగళవారం ఉదయం వర్షాలు పడుతున్నాయి. బుధవారం కూడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. దీంతో యమునా నీటి ఉధృతి, వర్షాల కారణంగా ఢిల్లీ కష్టాలు మరోసారి పెరిగే చాన్స్ ఉంది.
ఢిల్లీలో సోమవారం కూడా తేలికపాటి వర్షం కురిసింది. అక్కడ ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్గా ఉండి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడే అవకాశం ఉంది. మంగళవారం నుంచి జూలై 22 వరకు తేలికపాటి, మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నిజానికి భారీ వర్షాల కారణంగా దేశంలోని అనేక నదులు ఉప్పొంగుతున్నాయి. ప్రధానంగా గంగ, యమునా ఇందులో చాలా విధ్వంసం సృష్టించింది. దీంతో ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలు వరదల బారిన పడ్డాయి. మీడియా కథనాల ప్రకారం ఉత్తరాఖండ్లోని నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతోపాటు బద్రీనాథ్ జాతీయ రహదారితో సహా అనేక రహదారులు మూసివేశారు. ఉత్తరాఖండ్లోని ఉధమ్సింగ్ నగర్, నైనిటాల్, చంపావత్, అల్మోరా, బాగేశ్వర్, పితోర్గఢ్ జిల్లాలకు నేటికీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ.. ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. అంతేకాకుండా రాజస్థాన్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
మరోవైపు ఢల్లీిలో బీభత్సం సృష్టించిన యమునా నది ఉత్తరప్రదేశ్లోని 11 జిల్లాలనూ ముంచెత్తింది సృష్టించింది. మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది కాకుండా, హిమాచల్ ప్రదేశ్లోని ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన కులు-మనాలిలో వరదలు బీభత్సం సృష్టించాయి. కులుమనాలి మధ్య జాతీయ రహదారిపై నీటి కారణంగా బాగా దెబ్బతింది. దీంతో పాటు వ్యాస్ నదిపై నిర్మించిన పలు వంతెనలు కూడా వరదలో కొట్టుకుపోయాయి.