ఢిల్లీ, న్యూస్లీడర్, జూలై 18 : ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాల వల్ల బెయిల్ మంజూరు చేయాలని రాఘవ కోర్టుకు అభ్యర్థించారు.
కాగా, గతంలో రాఘవకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ీ ఆశ్రయించింది. ప్రస్తుతం రాఘవకు బెయిల్ మంజూరుపై ఈడీ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. మరోవైపు ఈడీ కేసులో త్వరలో దినేష్ అరోరా అప్రూవర్గా మారనున్నారు.
కేసు విచారణలో అధికారులకు సహకరించాలని, ఎప్పుడు పిలిచినా హాజరవ్వాలని హైకోర్టు తెలిపింది. చెన్నై సిటీకే పరిమితం కావాలని, పాస్ పోర్ట్ను కోర్టుకు సరెండర్ చేయాలని, దేశం దాటి వెళ్లొద్దని ఆదేశించింది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో సాయంత్రం 4 గంటలకు ఈడీ ఎదుట రిపోర్టు చేయాలని పేర్కొంది.