బెంగళూరు, న్యూస్లీడర్, జూలై 19 : బీజేపీని ఓడిరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రతిపక్ష పార్టీలు బెంగళూరులో రెండు రోజుల పాటు సమావేశమయ్యాయి. మొత్తం 26 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. ఆ ఫ్రంట్కు ‘ఇండియా’ అనే పేరును ప్రకటించాయి. ఇండియా అంటే.. ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్. తాజాగా ఈ కూటమికి ట్యాగ్లైన్గా ‘జీతేగా భారత్’ను ఎంచుకున్నాయి. గత రాత్రి జరిగిన చర్చల తర్వాత జీతేగా భారత్ (భారత్ గెలుస్తుంది)పై తుది నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టినప్పుడు కూటమి పేరులో భారత్ అనే పదం ఉండాలని భావించారు. కానీ, అది సాధ్యం కాకపోవడంతో ఇది ట్యాగ్లైన్లో కనిపించాలని నిర్ణయించుకున్నారు.