విజయవాడ, న్యూస్ లీడర్, జూలై 26: విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ఇంద్రకీలాద్రిపై కొండరాళ్లు బుధవారం జారి ఘాట్ రోడ్ మీద పడ్డాయి. దీంతో అప్రమత్తమైన దేవస్థానం అధికారులు ఆ మార్గంలో టోల్గేట్ను మూసివేశారు. భక్తులను మల్లికార్జున మహామండపం మెట్ల మార్గం వైపు మళ్లించారు. ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది ఘాట్ రోడ్డులో పడిపోయిన రాళ్లను యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నారు. ఎవరికీ గాయాలు కాకపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.