. నోటీసులిచ్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్
. మిగిలిన బీజేపీయేతర పక్షాలు మద్దతు పలుకుతాయనే ఆశ
. మెజార్టీ లేకపోయినా గెలుస్తామన్న ధీమా
ఢిల్లీ, న్యూస్ లీడర్, జూలై 26: మణిపూర్ అంశంపై పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి అనుమతీయాల్సిందిగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు స్పీకర్కు నోటీసులిచ్చాయి. మణిపూర్ అంశంపై పార్లమెంటులో ప్రధాని మోడీ ప్రకటన చేయాల్సిందేనని పట్టుబట్టిన విపక్ష కూటమి ‘ఇండియాలి కేంద్ర ప్రభుత్వంపై ‘అవిశ్వాస తీర్మాన అస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు స్పీకర్కు నోటీసులిచ్చినట్లు కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ వెల్లడిరచారు. అటు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు కూడా నోటీసు ఇచ్చారు. ప్రవేశపెడితే..ప్రధాని మోడీ మాట్లాడటంతోపాటు తమకూ పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందని విపక్ష కూటమి యోచిస్తోంది. ఇప్పటికే తీర్మాన ముసాయిదాను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం స్పీకర్ కార్యాలయానికి కాంగ్రెస్, బీఆర్ఎస్లు నోటీసులిచ్చాయి.
మెజార్టీ లేకున్నా ‘అవిశ్వాసం’…
ప్రస్తుతం లోక్సభలో ఎన్డీయే కూటమికి 330 మంది సభ్యుల మద్దతుంది. ‘ఇండియా’కు 140 మంది సభ్యులున్నారు. మరో 60 మందికిపైగా ఏ కూటమిలోనూ లేరు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోవడం దాదాపు ఖాయమే అయినప్పటికీ.. కేవలం మణిపూర్ అంశంలో చర్చల కోసం ప్రతిపక్షాలు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గతంలో 2018లో మోడీ ప్రభుత్వంపై అప్పటి యూపీఏ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఎన్డీయేకు 325 మంది, విపక్షాలకు 126 మంది మద్దతు ఇవ్వడంతో అది వీగిపోయింది. అయితే మణిపూర్ అంశం కావడంతో మిగిలిన బీజేపీయేతర పక్షాలు మద్దతు పలుకుతాయనే ఆశతో ఇండియా కూటమి ఉంది.