మహారాష్ట్ర, న్యూస్ లీడర్, జూలై 27: మహారాష్ట్రలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. శ్మశానంలో ఓ ప్రేమ జంట పెళ్లి చేసుకుంది. అహ్మద్నగర్ జిల్లా శిర్డీ సమీపంలోని రహతా గ్రామానికి చెందిన గంగాధర్ స్థానిక శ్మశానంలో కాటికాపరిగా పనిచేస్తున్నారు. ఆయనది మహాసంజోగీ సామాజిక వర్గం. కొన్నేళ్లుగా ఆయన తన కుటుంబంతో కలిసి శ్మశానంలోనే ఉంటున్నారు. గంగాధర్ కుమార్తె మయూరీ శ్మశానంలోనే పుట్టి పెరిగింది. 12వ తరగతి వరకూ చదువుకుంది. అయితే, ఆమె శిర్డీకి చెందిన మనోజ్ అనే యువకుడిని ప్రేమించడంతో ఇరు కుటుంబాల వారు ఆ జంటకు ఇటీవల వివాహం జరిపించారు. మయూరి పుట్టి పెరిగినచోటే ఆమె పెళ్లి చేయాలని గంగాధర్ కోరడంతో ఆ జంట వివాహం శ్మశానంలో బంధువులు, స్నేహితుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది.