` 29 ఉదయం 6.30 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం
` మరుసటి రోజు ఉదయం 6.30కి ప్రయోగం
` రోదసిలోకి సింగపూర్కు చెందిన 7 శాటిలైట్లు
శ్రీహరికోట, న్యూస్లీడర్, జూలై 28 : చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ నెల 30వ తేదీ ఉదయం 6.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ56ను ప్రయోగించబోతోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ ప్రయోగం చేపట్టనున్నారు.
ఈ ప్రయోగం ద్వారా 422 కిలోల బరువు కలిగిన సింగపూర్కు చెందిన ఏడు ఉపగ్రహాలను ఇస్రో రోదసిలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే అన్ని దశలను అనుసంధానం చేసి పూర్తి స్థాయి రాకెట్ ను మొబైల్ సర్వీస్ టవర్ వద్దకు తీసుకొచ్చారు. రాకెట్ శిఖర భాగాన ఏడు శాటిలైట్లను అమర్చి, హీట్ షీల్డ్స్ ను క్లోజ్ చేసే ప్రక్రియను పూర్తి చేశారు. శనివారం ఉదయం 6.30 గంటలకు కౌంట్ డౌన్ ను ప్రారంభించబోతున్నారు.