. అర్ధరాత్రి 12.53 గంటలకు భూకంపం
. రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైన భూకంప తీవ్రత
అండమాన్, న్యూస్ లీడర్, జూలై 29: అండమాన్ నికోబార్ దీవులను మరోసారి భూకంపం వణికించింది. పోర్ట్ బ్లెయిర్కు సమీపంలో అర్ధరాత్రి 12.53 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.9గా నమోదయింది. భూకంప కేంద్రం పోర్ట్ బ్లెయిర్కు ఆగ్నేయ దిశలో 126 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడిరచింది. భూ ఉపరితలానికి 69 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని తెలిపింది. దీంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కి పడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.