హైదరాబాద్, న్యూస్లీడర్, జూలై 29 : విపక్ష నేతలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తనదైన శైలిలో సెటైర్ల పరంపరను కొనసాగిస్తున్నారు. ట్వీట్ మీద ట్వీట్ చేస్తూ పంచ్లను విసురుతున్నారు. తాజాగా.. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని టార్గెట్ చేస్తూ ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేశారు. ‘కొత్త అధ్యక్షురాలు ఫ్లెక్సీలతో లేని హడావుడి చేసే బదులు.. వైజాగ్ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలనో, రైల్వే జోన్, ఇండస్ట్రియల్ కారిడార్ త్వరగా ఏర్పాటు చేయాలనో పోరాడొచ్చుగా! ప్రజలకు కాస్తయినా ప్రయోజనం ఉంటుంది. ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి పని చేయడం ఎందుకు?’ అంటూ విమర్శలు సంధించారు.