మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్పై 2011లో జీవిత, రాజశేఖర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం అందరికి తెలిసిన విషయమే. ఆ వివాదాస్పద వ్యాఖ్యలు పై అప్పటిలో నిర్మాత అల్లు అరవింద్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు వారి పై కోర్ట్ లో పరువు నష్టం దావా కూడా వేశారు అల్లు అరవింద్. దాదాపు 12 ఏళ్ళ పాటు ఈ కేసు పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు.. జీవిత, రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోవడం, వారు అన్నారని ప్రూవ్ అవ్వడంతో వారిద్దరికీ ఏడాది జైలు శిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధిస్తు ఇటీవల తీర్పుని ఇచ్చింది.
కానీ ఇన్నేళ్లలో ఆ విషయం గురించి ఇప్పటి వరకు మెగా కుటుంబం నుంచి ఎవరు మాట్లాడలేదు. కేసు వేసిన అల్లు అరవింద్ కూడా మీడియా ముందు ఎక్కడ నోరు విప్పలేదు. తాజాగా భోళా శంకర్ ప్రీ రిలీజ్ వేదిక పై అల్లు అరవింద్ ఆ కేసు గురించి మాట్లాడారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “నేను ఇక్కడికి వచ్చింది సినిమా సక్సెస్ కావాలని చెప్పడానికి కాదు. ఎందుకంటే ఆయన చూడని బ్లాక్ బస్టర్ లేవు, ఆయన చూడని కలెక్షన్స్ లేవు. మీరు ఆయన సినిమాలు చూస్తూ అభిమానులు అయ్యి ఉంటారు. కానీ నేను ఆయనతో సినిమాలో చేస్తూ అభిమానిని అయ్యాను. ఆ అభిమానం ఎలాంటిది అంటే.. ఆయన్ని పై తప్పుడు మాటల మాట్లాడినందుకు వాళ్ళని జైలుకి పంపించేందుకు 12 ఏళ్ళు పాటు పోరాడాను. అది నా అభిమానం” అంటూ పేర్కొన్నాడు.