. తన జీవితమంతా ఉద్యమాలకే అంకితం
. చివరిలో విమర్శలపాలు
(గద్దర్ జననం 1948 ` మరణం 2023 ఆగస్టు 6)
గద్దర్గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ రావు (1948 – 2023, ఆగస్టు 6) ప్రముఖ విప్లవ కవి. ఈయనకు గద్దర్ అను పేరును స్వాతంత్య్రం రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన ‘గదర్ పార్టీ’ కు గుర్తుగా పెట్టుకున్నారు. అప్పటి నుంచీ ఆయన పేరు కనుమరుగై ఈ పేరే ప్రజారంజకంగా నిలిచిపోయింది.
జీవిత విశేషాలు
గద్దర్ మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1948లో దళిత కుటుంబంలో జన్మించారు. విద్యాభ్యాసం నిజామాబాదు జిల్లా మహబూబ్ నగర్లో, ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్లో జరిగింది. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేశారు. దీనికోసం ఆయన బుర్రకథను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చే వారు. 1971లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట ‘‘ఆపర రిక్షా’’ రాశాడు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడిరది.
జననాట్యమండలి ఏర్పాటుతో…
కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి ఆయన బుర్రకథలను తయారు చేసుకొని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించేవారు. ఆ తర్వాత ఆయన అనేక పాటలు రాశారు. 1972లో జన నాట్య మండలి ఏర్పడిరది. ఇది పల్లెల్లో జరుగుతున్న ఆకృత్యాలను ఎదురించేందుకు, దళితులను మేల్కొల్పేందుకు వారిని చైతన్య పరిచేందుకు ఏర్పడిరది. అయితే 1975లో గద్దర్ బ్యాంకు రిక్రూట్మెంట్ పరీక్ష రాశారు. అయన కెనరా బ్యాంకులో క్లార్క్గా చేరారు, తర్వాత వివాహం చేసుకున్నారు. భార్య పేరు విమల, ఆయనకు ముగ్గురు పిల్లలు, సూర్యుడు, చంద్రుడు (2003లో అనారోగ్యంతో మరణించారు). వెన్నెల.
దేశ వ్యాప్తంగా పలు ప్రదర్శనలు
మా భూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి యాదగిరి పాడిన బండెనక బండి కట్టి అనే పాటను ఆయనే పాడి, ఆడారు. 1984లో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు.1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. జన నాట్య మండలిలో చేరారు. ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్ళారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. కింద గోచి ధోతి, పైన గొంగళి ధరించేవారు. ఆయన పాడే పాటలకు ప్రజల్లో చైతన్యం కలిగిస్తుంటాయి. దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట, నష్టాలను ఆయన, ఆయన బృందం కళ్లకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలియ జెప్పేవారు. ఆయన పాటలు వందలు, వేలు కాసెట్లుగా, సీడీలుగా రికార్డ్ అయి అత్యధికంగా అమ్ముడుపోయాయి.
నిషేధం ఎత్తివేత తరువాత…
మర్రి చెన్నారెడ్డి రెండవసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్స్పై ఆయన ఉదారంగా వ్యవహరించారు, వారిపై నిషేధం ఎత్తి వేయబడిరది. 1990 ఫిబ్రవరి 18న జన నాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ హైదరాబాద్లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు.
ఆయనపై కాల్పులు
1997 ఏప్రిల్ 6న ఆయనపై పోలీసులు విరుచుకు పడి కాల్పులు జరిపారు. ఆయన శరీరంలోకి అనేక బుల్లెట్లు గుచ్చుకున్నాయి. అన్ని బుల్లెట్లను తొలగించారు కానీ ఒక్క బుల్లెట్ను మాత్రం డాక్టర్లు తొలగించలేదు. అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని వదిలేశారు. ఆ తర్వాత నక్సలైట్ పార్టీలో ఉంటూ విప్లవ సాహిత్యాన్ని ప్రజల ముందు ఉంచారు. విప్లవ రచయితల సంఘం ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్నారు. 2002లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్స్ గద్దర్, వరవరరావులను తమ దూతలుగా పంపారు. నకిలీ ఎన్కౌంటర్లను ఆయన తీవ్రంగా నిరసించారు.
తెలంగాణ ఉద్యమంలో
తెలంగాణ ఉద్యమం పునరుద్ధరించడంతో, గద్దర్ మరోసారి వెనుకబడిన కులాలు, నిమ్న కులాల ఉద్ధరణ ఉద్దేశంతో ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం తన మద్దతును తెలపటానికి ప్రారంభించారు. బలమైన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నప్పటికీ, అతను ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని వ్యతిరేకించే భారతదేశం లోని కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలతో తన భావాలను పంచుకునే లేదు. గద్దర్ మొదటి నుంచీ తెలంగాణా వాదే. మావోయిస్ట్ పార్టీ తెలంగాణాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఆయన తెలంగాణకే మద్దతు తెలిపారు. దేవేందర్ గౌడ్ నవ తెలంగాణా పార్టీ పెట్టినప్పుడు ఆయనకు కూడా మద్దతు తెలిపారు గద్దర్. గద్దర్ పై దాడి జరిగినప్పుడు హోం మినిస్టర్ దేవేందర్ గౌడ్. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణా ప్రజా ఫ్రంట్ ను స్థాపించారు.
సినిమారంగం
మాభూమి సినిమాలోని బండెనక బండి కట్టి అనే పాటను పాడడంతోపాటు పాటలో నటించాడు. ఆయన రాసిన పాటల్లో ‘‘అమ్మ తెలంగాణమా’’ అనే పాట బహుల ప్రజాదరణ పొందింది. తెలంగాణా లోని అన్ని అంశాలను స్పృశిస్తూ సాగింది ఈ పాట. ఆయన రాసిన ‘‘నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ’’ అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు వచ్చింది అయితే ఆయన ఆ అవార్డును తిరస్కరించారు. ఆయన మరోసారి జై బోలో తెలంగాణా సినిమాలో తెరపైన కనిపించాడు. ‘పొడుస్తున్న పొద్దూ’ మీద పాట ఆయనే రాసి పాడి, అభినయించారు. ఈ పాట అద్భుత విజయం సాధించింది. ఆయన రాసిన పలు పాటలకు పలు నంది అవార్డులు వచ్చాయి.
గుండెపోటుతో మరణం…
గుండెపోటు కారణంగా 2023 జూలై 20న హైదరాబాద్, అమీర్ పేట్లోని అపోలో ఆసుపత్రిలో చేరిన గద్దర్కు ఆగస్టు 3న వైద్యులు బైపాస్ సర్జరీ చేశారు. తరువాత చికిత్స పొందిన గద్దర్ ఊపిరితిత్తులు, యూరినరీ సమస్యలతో 2023, ఆగస్టు 6న మధ్యాహ్నం 3 గంటలకు మరణించారు. చివరి దశలో ఆయన కాంగ్రెస్లో కలవడంతో పలు విమర్శలు ఎదుర్కొన్నారు.