. ఈ నెల 20తో ముగియనుండడంతో తొలుత రెండు నెలలు, ఆపై ఏడాది పాటు పొడిగింపు . మతం మారి నస్రుల్లాను పెళ్లాడిన రాజస్థానీ మహిళ
ఇస్లామాబాద్ : ఫేస్బుక్ ప్రియుడి కోసం పాకిస్థాన్ వెళ్లిన రాజస్థానీ మహిళ అంజూ మతం మారి ప్రియుడిని పెళ్లాడిరది. అయితే విజిటర్ వీసాతో అంజూ పాకిస్థాన్లో అడుగుపెట్టింది. వీసా గడువు ఈ నెల 20న ముగియనుండగా.. తాజాగా పాక్ ప్రభుత్వం ఈ గడువును ఏడాది పాటు పొడిగించింది. తొలుత రెండు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించినా తర్వాత ఏడాది పాటు దేశంలో ఉండేలా వీసా గడువును పొడిగించింది.
రాజస్థాన్కు చెందిన అంజూకు భారత్లో భర్త, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా ఫేస్బుక్లో పరిచయమైన యువకుడు నస్రుల్లా కోసం ఏకంగా దేశం దాటి వెళ్లింది. టూరిస్టు వీసా సంపాదించి వాఘా సరిహద్దు నుంచి పాకిస్థాన్లోకి అడుగుపెట్టింది. తన స్నేహితుడిని కలుసుకోవడంతో పాటు పాక్ను చూడాలని వచ్చినట్లు చెప్పిన అంజూ.. రెండు రోజుల్లోనే మతం మారి ఫాతిమాగా పేరు మార్చుకుని నస్రుల్లాను పెళ్లాడిరది.
అంజూపై కేసు నమోదు
మరోవైపు, అంజూ మొదటి భర్త జైపూర్లో పోలీస్ కేసు పెట్టాడు. తనకు విడాకులు ఇవ్వకుండా అంజూ చేసుకున్న రెండో పెళ్లి చెల్లదని, ఆమెతో పాటు నస్రుల్లాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. దీంతో ఫాతిమా (అంజూ), నస్రుల్లాలపై జైపూర్ లో పోలీస్ కేసు నమోదైంది.