` దేశాన్ని హత్య చేశారని అంటే.. హర్షం ప్రకటిస్తున్నారే?
` రాుహుల్ గాంధీ ప్రసంగంపౖౖె స్మృతి ఇరానీ విమర్శ
ఢిల్లీ, న్యూస్లీడర్, ఆగస్టు 9 : అవిశ్వాసం తీర్మానంపై చర్చలో భాగంగా రెండో రోజైన బుధవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆక్షేపించారు. రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.
ఈ సందర్భంగా స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. మీరు ఇండియా (విపక్ష కూటమిని ఉద్దేశించి) కాదు. ఇండియాలో అవినీతి ఉండదు. ఇండియా ప్రతిభను మాత్రమే ప్రోత్సహిస్తుంది. వారసత్వాన్ని కాదు అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ‘క్విట్ ఇండియా’ ప్రస్తావన తీసుకొచ్చారు. అవినీతి.. భారత్ను వీడాలి, వారసత్వం.. భారత్ను వీడాలి వంటి పదాలను ఉపయోగించారు. అలాగే మణిపూర్పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిరచారు.
మణిపుర్ భారత్లో భాగం, దాన్ని ఎవరూ విడదీయలేరు. భారతమాతను హత్య చేశారని అంటే కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తున్నారు. ఏం అనుకోవాలి? అలా హర్షం ప్రకటిస్తారు? దేశంలో అవినీతిని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీనే. యూపీఏ హయాంలో మహిళలపై ఎన్నో అత్యాచార ఘటనలు జరిగాయి. రాజస్థాన్లో బాలికపై గ్యాంగ్ రేప్ చేసి.. ముక్కలుగా నరికేశారు. కశ్మీర్ పండితులు, మహిళలపై జరిగిన అన్యాయాలు రాహుల్కు కనిపించవా..? వాటిని ఒక సినిమాలో చూపిస్తే.. కాంగ్రెస్ నేతలు దాన్నొక ప్రచారమని అన్నారు. అలాంటి వారు ఇప్పుడు న్యాయం గురించి మాట్లాడుతున్నారు అని ఘాటుగా బదులిచ్చారు. పాదయాత్రలో భాగంగా ఆయన ‘ఆ ఆర్టికల్’ను మళ్లీ తెస్తామని రాహుల్ హామీ ఇచ్చారని, ఆర్టికల్ 370 రద్దు వల్లే రాహుల్ పాదయాత్ర చేయగలిగారనే గ్రహించాలన్నారు.