` సైబర్ క్రైమ్ సీఐడీ ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడి
అమరావతి, న్యూస్లీడర్, ఆగస్టు 12 : ముఖ్యమంత్రి కార్యాలయంలో డిజిటల్ సంతకాల దుర్వినియోగం కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సైబర్ క్రైమ్ సీఐడి ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడిరచారు. నిందితులు కొందరు కార్యదర్శుల డిజిటల్ సంతకాలను దుర్వినియోగం చేసి ‘సీఎం పిటిషన్’లు జారీ చేసినట్లు తెలిపారు. సీఎంవోలోని ముఖ్య అధికారులు రేవు ముత్యాల రాజు, ధనుంజయ్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి పేషీల్లో పని చేస్తున్న వీరు సంతకాలను దుర్వినియోగం చేసినట్టు ఎస్పీ తెలిపారు.
ఒక్కో ఫైల్కు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేశారన్నారు. ఏప్రిల్ నుంచి 3 నెలల్లో 66 సీఎంపీలు జారీ చేసిన నిందితులు.. మొత్తం రూ.15 లక్షల వరకూ వసూలు చేసినట్లు గుర్తించినట్టు చెప్పారు. అయితే, ఏ దస్త్రానికి సదరు అధికారుల నుంచి తుది ఆమోదం రాలేదని వెల్లడిరచారు. వైద్యులు, టీచర్ల బదిలీకి సంబంధించిన ఫైళ్లను సీఎంపీలు జారీ చేశారు. సీఎం పేషీలోని కార్యదర్శి భరత్ గుప్తా మొదట ఈ డిజిటల్ సంతకాల టాంపరింగ్ చేసినట్టు గుర్తించి ఫిర్యాదు చేశారు. సీఎంవో ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య డిజిటల్ సంతకం దొంగిలించి సీఎంపీలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ చేస్తున్నట్టు ఎస్పీ హర్ష వర్ధన్ రాజు తెలిపారు.