విజయవాడ, న్యూస్లీడర్, ఆగస్టు 12 : రాష్ట్రంలో బీజేపీ, జనసేన పొత్తు సంకేతాలను బలంగా వినిపించాలని పార్టీ శ్రేణులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు. శనివారం వర్చువల్ విధానంలో రాష్ట్ర కార్యవర్గ నేతలతో ఆమె సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే ఎన్నికలకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని, అందుకోసం ఇప్పటి నుంచే పని చేయాలని సూచించారు. ఈ క్రమంలో జనసేన శ్రేణులను కలుపుకొని పని చేయాలన్నారు.
రాష్ట్రంలో సర్పంచ్ల సమస్యలపై జరిపిన పోరాటం తీరు బాగుందని పురంధేశ్వరి ప్రశంసించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు. ఈ నెల 14న విభాజిత్, విభీషణ్ కార్యక్రమాన్ని చేపట్టాలని, రాత్రి బీజేవైఎం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన, డాక్యుమెంటరీ ప్రదర్శనను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాలు విజయవంతం అయ్యేందుకు నేతలందరూ కలిసి పని చేయాలని కోరారు.