. బార్ అసోసియేషన్ మెంబర్గా రిజిస్ట్రేషన్ . రెండుసార్లు ఎంపీగా విశిష్ట సేవలు . ఉత్తమ పార్లమెంటేరియన్గా గుర్తింపు
విజయనగరం, న్యూస్లీడర్, ఆగస్టు 14 : లోక్సభ మాజీ సభ్యురాలు, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ భార్య బొత్స రaాన్సీలక్ష్మి హైకోర్టు న్యాయవాదిగా మారారు. ఎంఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేసిన రaాన్సీ.. తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ బార్ అసోసియేషన్లో సభ్యత్వం తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఆమెకు అభినందనలు తెలిపారు. ఓ వైపు రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తూనే రaాన్సీ ఉన్నత చదువులు పూర్తి చేశారు. రెండుమార్లు లోక్సభకు ఎంపికైన రaాన్సీ.. ఉత్తమ పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందారు.
విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్గా రెండుమార్లు, బొబ్బిలి ఎంపీగా, విజయనగరం ఎంపీగా రaాన్సీ ప్రజాసేవ చేశారు. యాక్టివ్ పాలిటిక్స్లో బిజీగా ఉంటూనే చదువు కొనసాగించారు. చదువుకు వయస్సు అడ్డు కాదని ముందుకుసాగారు. రాజకీయాల్లో మహిళా సాధికారిత కోసం ప్రయత్నించిన రaాన్సీ ఉన్నత విద్య అభ్యసించడం ద్వారా ఆదర్శాలు చెప్పడమే కాకుండా ఆచరణలో పెట్టారు. ఎంపీగా ఉన్న సమయంలోనే ఫిలాసఫీలో మహిళా సాధికారత, సామాజిక న్యాయశాస్త్రంపై పీహెచ్డీ పూర్తి చేశారు.