.మరోమారు కక్ష్య పరిధి తగ్గించిన ఇస్రో
.17న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోనున్న ల్యాండర్
.23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్?
బెంగళూరు, న్యూస్లీడర్, ఆగస్టు 16 : భారతీయ శాస్త్ర, సాంకేతిక రంగంలో ఒక మహత్తర ఘట్టానికి సమయం ఆసన్నమైంది. చంద్రుడిపై పరిశోధనల నిమిత్తం రోదసిలోకి వెళ్లిన భారత వ్యోమనౌక చంద్రయాన్-3 లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. చంద్రుడి ఉపరితలంపై దిగే చరిత్రాత్మక ఘట్టానికి ఇది మరింత చేరువైంది. బుధవారం జాబిల్లి చివరి కక్ష్యలోకి ప్రవేశించింది.
చంద్రయాన్-3 కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని బుధవారం మరోసారి విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో వెల్లడిరచింది. దీంతో కక్ష్య తగ్గింపు ప్రక్రియలు ముగిశాయి. చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టేందుకు ఇదే చివరి కక్ష్య. తాజా విన్యాసంతో వ్యోమనౌక కక్ష్యను 153 సఎ ఞ 163 సఎలకు తగ్గించినట్లు ఇస్రో వెల్లడిరచింది. దీంతో ఈ అంతరిక్ష నౌక.. ఇప్పుడు చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి చేరింది.
చంద్రుడిని చేరాలంటే.. 40 రోజులా?
చంద్రయాన్`3కి సంబంధించి ఇప్పటివరకు ఇస్రో చేపట్టిన దశలన్నీ విజయవంతంగా పూర్తయ్యాయి. గురువారం ఉదయం ఆగస్టు 17న వ్యోమనౌకలోకి ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండిరగ్ మాడ్యూల్ విడిపోయే ప్రక్రియ చేపడతారు. అది సజావుగా జరిగితే ల్యాండిరగ్ మాడ్యూల్ విడిపోయి సొంతంగా జాబిల్లిని చుట్టేస్తుంది. అంతా సజావుగా సాగితే ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టవచ్చని ఇస్రో వెల్లడిరచింది.
‘చంద్రయాన్-3ని గత నెల 14న ఎల్వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టారు. ఆ మరుసటిరోజు తొలిసారి దీని కక్ష్యను పెంచారు. ఈ విధంగా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పెంచుతూ వచ్చారు. అయిదో భూకక్ష్య పూర్తయిన అనంతరం.. జాబిల్లి దిశగా ప్రయాణానికి ఆగస్టు 1న ‘ట్రాన్స్ లూనార్ కక్ష్య’లోకి ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ చంద్రుడికి చేరువ చేశారు.