ప్రేమికుడు కత్తిపోట్లకు గురైన ఘటన కానూరులో చోటుచేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కానూరు సనత్నగర్కు చెందిన లంకే నాగరాజు ఆటోనగర్లో లారీ బాడీ బిల్డింగ్ వర్క్షాపులో వెల్డర్గా పనిచేస్తుంటాడు.
ఆరేళ్ల నుంచి అతడు.. లా చదువుతున్న ఓ విద్యార్థినితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. ఇటీవల ఆమె మనసు మార్చుకొంది. తాను బాగా చదువుకొని ఉద్యోగం చేస్తున్న యువకుడిని వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపి తనను మర్చిపోవాలని కోరింది. ఫోన్లో ఉన్న ఫొటోలు, మెసేజ్లు తీసేయాల్సిందిగా కోరగా.. నాగరాజు అంగీకరించలేదు.
ఈనెల 2వ తేదీ అర్ధరాత్రి ఈమె తన తల్లితో కలిసి నాగరాజు ఇంటికి వెళ్లి అతడిని నిద్రలేపారు. తన కుమార్తె స్నేహితురాలిగానే వ్యవహరిస్తోంది కదా.. ఫొటోలు, మెసేజ్లు తీసేయకుండా ఎందుకు ఏడిపిస్తున్నావంటూ ఆమె తల్లి నాగరాజును ప్రశ్నిస్తూ ఫోన్ తీసుకొని అతడిని కత్తితో పొడిచింది.
భయాందోళనలకు గురైన నాగరాజు పెద్దగా కేకలు పెట్టగా తల్లీకూతురు అక్కడ నుంచి వెళ్లిపోయారు. స్థానికులు నాగరాజును ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. అతడి ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.