ఆలయ చెరువులో ఏళ్ల నాటి తాబేలు లభ్యమైంది. 50 కిలోలకుపైగా బరువు ఉన్న ఆ తాబేలును చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఇంతలో కొందరు గ్రామస్థులు దానిని తీసుకుని పరారయ్యారు. బిహార్లోని బక్సర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
జిల్లాలోని బ్రహ్మపుర్లో ఉన్న బాబా బ్రహ్మేశ్వరనాథ్ ఆలయ సుందరీకరణ పనులు గత ఆరు నెలలుగా జరుగుతున్నాయి. ఇటీవలే ఆలయ చెరువులోని పాత నీటిని తోడి కొత్త నీటిని నింపే ప్రక్రియను ప్రారంభించారు. ఆ సమయంలో భారీ తాబేలుతో పాటు చేపలు లభ్యమయ్యాయి.
అక్కడికి చేరుకున్న పలువురు గ్రామస్థులు.. తువ్వాలులో భారీ తాబేలును వేసుకుని పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తాబేలు కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు.