ఆ ట్రైన్ కు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దాంతో డ్రైవర్ ఆ ట్రైన్పై కంట్రోల్ కోల్పోయాడు. దెబ్బకి ట్రైన్ ఏకంగా ప్లాట్ఫాంపైకి దూసుకొచ్చింది. ఊహించని విధంగా ట్రైన్ ప్లాట్ ఫామ్ పైకి రావడంతో ప్రయాణికులు హడలెత్తారు. ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మథుర రైల్వేస్టేషన్లో జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఒక ప్యాసింజర్ రైలు శుకర్ బస్తీ స్టేషన్ నుంచి రాత్రి 10.49 గంటలకు మథుర రైల్వే స్టేషన్ కు చేరుకుంది.
ప్రయాణికులంతా ఆ రైలు నుంచి దిగి నింపాదిగా ఇంటికి వెళ్లిపోతున్నారు. కొంత మంది అదే ప్లాట్పాం పైకి వచ్చే మరో ట్రైన్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ.. సడన్గా బ్రేకులు ఫెయిలై ప్లాట్ఫాంపైకి రైలు ఒక్కసారిగా దూసుకెళ్లింది. అలానే వెళ్లి ప్లాట్ఫాంపై ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన వల్ల పలు రైళ్ల రాకపోకలకు ఆలస్యమయ్యాయని అధికారులు చెప్పారు.