TIRUPATHI | వివాహేతర సంబంధం చిచ్చు కారణంగా భార్యాభర్తల మధ్య కొంతకాలంగా సఖ్యత లేదు. విభేదాలను తొలగించి అక్క, బావలను ఒక్కటి చేయాలనుకున్న బావమరిదితో పాటు అతని భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. డీఎస్పీ సురేంద్రరెడ్డి, అలిపిరి సీఐ అబ్బన్న వివరాల మేరకు.. ‘మహారాష్ట్ర నాందేడ్ జిల్లా టరోడా కూడ్లోని నవజీవన్ నగర్కు చెందిన యువరాజ్ సంభాజి నార్వాడే భార్య మనీషా యువరాజ్, బావమరిది హర్షవర్ధన్ , ఆరేళ్ల కుమారుడు పక్షమ్, నాలుగేళ్ల కుమార్తె ప్రజ్ఞాన్తో కలసి తిరుపతి శ్రీకపిలేశ్వర స్వామి ఆలయ సమీపంలోని హోటల్కు గురువారం సాయంత్రం 3.30 గంటలకు వచ్చారు.
శ్రీవారి దర్శనార్థం తిరుపతి వచ్చినట్లు hotel నమోదు చేశారు. రాత్రికి హోటల్ గదికి భోజనం తెప్పించుకుని తిన్నారు. ఆ తరువాత కొడుకుతో కలసి సెల్ఫీ తీసుకున్నారు. మరుసటి రోజు ఉదయానికి hotel లో జంట హత్య జరిగినట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. hotel గదిలో మనీషా, హర్షవర్ధన్ రక్తపు మడుగులోపడి మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ సురేంద్రరెడ్డి, అలిపిరి సీఐ అబ్బన్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఎనిమిదేళ్ల కిందట మనీషాతో యువరాజ్కు వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య మనీషా ప్రవర్తనపై భర్త యువరాజ్కు అనుమానం వచ్చింది. కొంతకాలంగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఏడాదిగా అతను ఇల్లు వదిలి బయట తిరుగుతున్నారు. నాలుగు రోజుల కిందట తిరుపతికి వచ్చాడు. అతని బామ్మర్ది హర్షవర్ధన్ అక్క భావ మధ్య విభేదాలు తొలగించాలని ప్రయత్నించే క్రమంలో బావకు ఫోన్ చేశారు. తాను తిరుపతిలో ఉన్నానని.. ఇక్కడికి వస్తే మాట్లాడుకుందామని పిలిచారు. దీంతో అక్క, ఇద్దరు పిల్లలను తీసుకుని హర్షవర్ధన్ తిరుపతికి వచ్చారు. వారి మధ్య నెలకొన్న విభేదాలపై చర్చ జరిగింది.ఆ క్రమంలో గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు యువరాజ్ ముందే తెచ్చుకున్న కత్తితో భార్య, బావమరిదిపై అతి దారుణంగా దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పరీక్షల నిమిత్తం ఎస్వీ Medical college కి తరలించారు. భార్య, బావమరిదిని హత్యచేసిన తర్వాత నిందితుడు డయల్ 100కు ఫోన్ చేసి హతమార్చిన విషయం చెప్పారు. నిందితుడి అన్నతో.. తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.