CM YS JAGAN MOTHER VIJAYAMMA | ఏపీ సీఎం వైయస్ తల్లి విజయమ్మకు త్రుటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన ఆమె ఒంగోలు వెళ్తుండగా.. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి ముందుగా వెళ్తున్న వాహనం నెమ్మదించడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశారు.
దాంతో అదే వాహన శ్రేణిలోని మరొక కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయమ్మ ప్రయాణిస్తున్న కారు వెనకభాగం స్వల్పంగా దెబ్బతింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తన సోదరి అత్త, తితిదే మాజీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మను ఒంగోలులో విజయమ్మ పరామర్శించారు. రాత్రికి అక్కడే బస చేసి ఉదయం తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు.