PALNADU DISTRICT | ఓ కానిస్టేబుల్ మరో యువతితో కలిసి ఉండగా అతని భార్య రెడ్ హ్యాండెడ్గా వారిద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. నల్లపాడు సీఐ బత్తుల శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు కట్టి శ్రీను గతంలో నల్లపాడు పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేసి ప్రస్తుతం ఎస్టీఎఫ్లో కొనసాగుతున్నారు. శ్రీను PALNADU DISTRICT నాదెండ్లకు చెందిన దివ్యను గతంలో వివాహం చేసుకొని నాదెండ్లలో నివాసం ఉంటున్నారు.
కోర్టు పనులపై వచ్చిన సమయంలో శ్రీనుకు దాచేపల్లికి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఆమె ఎస్సై పోటీ పరీక్షలు రాసేందుకు కోచింగ్ తీసుకుంటూ గుంటూరులో ఉంటోంది. వీరిద్దరి పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఇద్దరూ కలిసి అమరావతి రోడ్డు ఐడీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో కొంతకాలంగా కలిసి ఉంటున్నారు. యువతి మోజులో పడిన కానిస్టేబుల్ శ్రీను భార్య, బిడ్డను పట్టించుకోవటం లేదు. దీంతో దివ్య ఆరా తీయగా తన భర్త వేరే యువతితో ఉంటున్నట్లు తెలిసి పలుమార్లు భర్తను నిలదీసింది.
యువతిని సైతం హెచ్చరించింది. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో గురువారం దివ్య తన భర్త సదరు యువతితో ఇంటిలో ఉన్న సమయంలో అక్కడకు వెళ్లి బయటకు రావాలని కేకలు వేసింది. శ్రీను తలుపులు తీయలేదు. ఈ విషయం నల్లపాడు పోలీసులకు చెప్పడంతో వారు వచ్చి గదిలో ఉన్న ఇద్దరిని బయటకు రప్పించారు. కానిస్టేబుల్ మెట్లు దిగి వెళ్లేందుకు ప్రయత్నించగా అతని భార్య, బంధువులు అతని నిలవరించే క్రమంలో జరిగిన పెనుగులాటలో శ్రీను చొక్కా చిరిగిపోయింది.
నల్లపాడు పోలీసులు వారిద్దరిని ఆటోలో ఎక్కించుకుని స్టేషన్కు తరలించే సమయంలో దివ్య ఆటోకు అడ్డుపడింది. ఏదైనా ఉంటే స్టేషన్కు వచ్చి మాట్లాడుకోమని పోలీసులు ఆమెను బలవంతంగా పక్కకు నెట్టి కానిస్టేబుల్ శ్రీను, యువతిని స్టేషన్కు తరలించారు. ఇరువర్గాలకు చెందిన పెద్దలు స్టేషన్కు చేరుకుని రాజీ ప్రయత్నాలు చేపట్టారు. కానిస్టేబుల్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు