GANG RAPE | భార్యాభర్తలు బైక్పై సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పండగ రోజు సొంతూరికి బయల్దేరారు. కానీ ఓ ఐదుగురు దండగులు వారిని అడ్డగించి.. భర్తని చితకబాది భార్యపై అతని కళ్లముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఒడిశాలోని (ODISHA) డెంకానాల్ జిల్లాలో చోటు చేసుకుంది.
జాజ్పుర్ జిల్లాకు చెందిన ఓ వివాహిత చదువుకునేందుకు బారునా ప్రాంతంలో ఉంటున్నారు. పండగ కావడంతో ఆమెను తీసుకెళ్లేందుకు జాజ్పుర్ నుంచి భర్త వచ్చాడు. ఇద్దరూ కలిసి సాయంత్రం బైక్పై కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుండగా.. ఓ వాగు సమీపంలో వారిని ఐదుగురు అడ్డగించారు. మాట్లాడుతుండగానే భర్తపై దాడి చేసి.. మొబైల్, బైక్ తాళాలు లాక్కున్నారు. అతడిని చావగొట్టి.. భార్యను సమీపంలోని అడవిలోకి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు భూబన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఇప్పటి వరకు ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.