HEALTH NEWS | గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. ఉదయం తొమ్మిదైనా గానీ చలితీవ్రత తగ్గట్లేదు. అందులోనూ ఈ కాలంలో సూర్యుడు పగటిపూట తక్కువగా ఉంటాడు. దీంతో సాయంత్రం 6 అయిందంటే చాలు ఇంటికే పరిమితం కావాల్సి వస్తుంది.
చలినుంచి తప్పించుకునేందుకు అనేక బట్టలు వేసుకోవాల్సి వస్తుంది. అయినా చలినుంచి ఉపశమనం కలగడంలేదు. ఈ క్రమంలో నైట్ పడుకునే సమయంలో చలికి తట్టుకోలేక చాలా మంది ముఖం అంతా కప్పుకుని పడుకుంటారు. కానీ అలా చేయొద్దంటున్నారు నిపుణులు.
రాత్రంతా బెడ్ షీట్ల లోపల ముఖం పెట్టుకుని పడుకోవడం వల్ల ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. అదే సమయంలో, పెరిగిన వేడి కారణంగా అలసట, తలనొప్పి లేదా గందరగోళం వంటి సమస్యలు కూడా సంభవించవచ్చు. రాత్రిపూట బొంత లోపల నిద్రపోవడం కూడా మానసిక ఆరోగ్యానికి భంగం కలిగిస్తుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఇలా ఎక్కువ కాలం చేసే వారికి కూడా అల్జీమర్స్ లేదా డిమెన్షియా వంటి తీవ్రమైన మతిమరుపు వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
మీ కుటుంబంలో ఎవరైనా ముస్కు తన్ని నిద్రపోయే అలవాటు ఉంటే వారిలో ఆక్సీజన్ సరఫరా తక్కువవుతుందని తెలపాలి. అలా పడుకోవద్దని హెచ్చరించండి. దీని వల్ల ఊపిరాడక పోవడం లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆక్సిజన్ లేకపోవడం ఆస్తమా లేదా గుండె జబ్బులతో బాధపడుతున్న వ్యక్తులకు తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో గుండెపోటు కూడా రావొచ్చు.